Categories
కీర్తనలు

కీర్తనలు 52

ప్రధానగాయకునికి. ఎదోమీయుడైన దోయేగు సౌలునొద్దకు వచ్చి–దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చియున్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవధ్యానము.

1 శూరుడా, చేసిన కీడునుబట్టి నీ వెందుకు అతిశయ

పడుచున్నావు?

దేవుని కృప నిత్యముండును.

2 మోసము చేయువాడా,

వాడిగల మంగల కత్తివలె నీ నాలుక నాశనము చేయ

నుద్దేశించుచున్నది

3 మేలుకంటె కీడుచేయుటయు నీతి పలుకుటకంటె

అబద్ధము చెప్పుటయు నీకిష్టము.(సెలా.)

4 కపటమైన నాలుక గలవాడా,

అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము.

5 కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును

నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములోనుండి

నిన్ను పెల్లగించును

సజీవుల దేశములోనుండి నిన్ను నిర్మూలము చేయును.(సెలా.)

6 నీతిమంతులు చూచి భయభక్తులుకలిగి

7 –ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక

తన ధనసమృద్ధియందు నమ్మిక యుంచి

తన చేటును బలపరచుకొనినవాడు వీడేయని చెప్పు

కొనుచు వానిని చూచి నవ్వుదురు.

8 నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టువలె నున్నాను

నిత్యము దేవుని కృపయందు నమ్మిక యుంచుచున్నాను

9 నీవు దాని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను

స్తుతించెదను.

నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది

నేను దాని స్మరించి కనిపెట్టుచున్నాను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/52-f09bdd67033f8477f0b82fe95accbbe4.mp3?version_id=1787—

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *