ప్రధానగాయకునికి. ఎదోమీయుడైన దోయేగు సౌలునొద్దకు వచ్చి–దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చియున్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవధ్యానము.
1 శూరుడా, చేసిన కీడునుబట్టి నీ వెందుకు అతిశయ
పడుచున్నావు?
దేవుని కృప నిత్యముండును.
2 మోసము చేయువాడా,
వాడిగల మంగల కత్తివలె నీ నాలుక నాశనము చేయ
నుద్దేశించుచున్నది
3 మేలుకంటె కీడుచేయుటయు నీతి పలుకుటకంటె
అబద్ధము చెప్పుటయు నీకిష్టము.(సెలా.)
4 కపటమైన నాలుక గలవాడా,
అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము.
5 కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును
నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములోనుండి
నిన్ను పెల్లగించును
సజీవుల దేశములోనుండి నిన్ను నిర్మూలము చేయును.(సెలా.)
6 నీతిమంతులు చూచి భయభక్తులుకలిగి
7 –ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక
తన ధనసమృద్ధియందు నమ్మిక యుంచి
తన చేటును బలపరచుకొనినవాడు వీడేయని చెప్పు
కొనుచు వానిని చూచి నవ్వుదురు.
8 నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టువలె నున్నాను
నిత్యము దేవుని కృపయందు నమ్మిక యుంచుచున్నాను
9 నీవు దాని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను
స్తుతించెదను.
నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది
నేను దాని స్మరించి కనిపెట్టుచున్నాను.
—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PSA/52-f09bdd67033f8477f0b82fe95accbbe4.mp3?version_id=1787—